రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ నమాజ్ కోసం ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు. వెంటనే ఈ రూమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అదే రూమ్లో ఎమ్మెల్యేలు కూర్చొని భజనలు చేయడం ప్రారంభించారు. సోమవారం ఉదయాన్నే అసెంబ్లీకి భజన వాయిద్యాలతో వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. హరే రామ హరే కృష్ణ, జై శ్రీరామ్, హర్ హర్ మహదేవ్ నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణమంతా మార్మోగిపోయింది. దేవ్ఘర్ ఎమ్మెల్యే నారాయణ్ దాస్ పూజారిగా మారారు.
ఈ నమాజ్ రూమ్ కేటాయింపును రద్దు చేసే వరకూ తాము ఇలాగే నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. అసెంబ్లీ లోపల, వెలుపల బీజేపీ ఎమ్మెల్యేలు నానా హంగామా చేశారు. ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలు చేసుకోవడానికి అసెంబ్లీ స్పీకర్ ప్రత్యేకంగా ఓ రూమ్ కేటాయించడంతో ఈ రచ్చ మొదలైంది. దీనిని నిరసిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో హనుమాన్ ఆలయంతోపాటు ఇతర మతాల వారికి కూడా రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.