ముంబై: ఆక్సిజన్ లేక శ్వాసతీసుకునేందుకు ఇబ్బంది పడుతున్న కరోనా రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు సమకూర్చి కాపాడిన పోలీసులు ఇబ్బందుల్లో పడ్డారు. నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినట్లు ఆరోపణలు రావడంతో చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మహారాష్ట్రలోని నాగపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జరిపట్కాలోని తిరుపుడే హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడంతో ఆదివారం అర్థరాత్రి వేళ వెంటిలేషన్పై ఉన్న 15 మంది కరోనా రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. అత్యవసరంగా పది ఆక్సిజన్ సిలిండర్లు కావాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది అర్థరాత్రి వేళ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లారు. డ్యూటీలో ఉన్న ఎస్ఐ మహాదేవ్ నాయక్వాడేకు పరిస్థితి వివరించి ఆయన సహాయం కోరారు.
దీంతో ఎస్ఐ తన సిబ్బందితో కసిలి ఆ ప్రాంతంలోని ఆక్సిజన్ ప్లాంట్కు వెళ్లారు. ఆక్సిజన్ సిలిండర్లను అత్యవసరంగా సరఫరా చేయాలని ప్లాంట్ యజమానిని కోరారు. అయితే జిల్లా యంత్రాంగం నుంచి అధికారికంగా లేఖ లేకపోవడంతో తొలుత నిరాకరించారు. పోలీస్ అధికారి మహాదేవ్ విన్నపం మేరకు చివరకు ఏడు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. వాటిని ఆసుపత్రికి సరఫరా చేయడంతో 15 మంది కరోనా రోగులకు ప్రాణాప్రాయం తప్పింది.
అయితే నిబంధనలకు విరుద్ధంగా ఆక్సిజన్ ప్లాంట్ నుంచి ఆసుపత్రికి ఆక్సిజన్ సిలిండర్లను సమకూర్చిన ఎస్ఐ మహదేవ్, నలుగురు పోలీస్ సిబ్బందిపై దర్యాప్తునకు ఉన్నతాధికారులు ఆదేశించారు.