న్యూఢిల్లీ, జూన్ 3: కరోనా స్వీయ పరీక్ష కిట్లు త్వరలో మందుల దుకాణాల్లో, ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి రానున్నాయి. ‘కొవిసెల్ఫ్’ అని పేరు పెట్టిన ఈ కిట్ల రవాణా పుణె నుంచి ప్రారంభమైంది. సొంతంగా ఇంట్లో ఎవరికి వారు వినియోగించుకునేలా ఈ కిట్లను పుణెకి చెందిన ‘మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్’ అభివృద్ధి చేసింది. 15 నిమిషాల్లోనే పరీక్ష ఫలితం వస్తుంది. ఒక్కో కిట్ ధరను రూ.250గా నిర్ణయించారు. వీటికి గత నెలలో ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చింది.