భోపాల్: అత్యాచారం, గృహ హింస కింద మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్పై కేసు నమోదు అయ్యింది. ఆయన భార్యే ఈ కేసులు పెట్టింది. ధార్ జిల్లాలో ఈ కేసులు బుక్ అయ్యాయి. అసహజ శృంగారానికి, బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఆ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు ఉన్నాయి. ఇంట్లో పనిమనిషి భర్త పేరుపై అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఆ ఎమ్మెల్యే భార్య ఆరోపించింది. సహజీవనం చేస్తున్న సోనియా భరద్వాజ్ ఆత్మహత్య పాల్పడటానికి ఎమ్మెల్యేనే కారణం అంటూ భార్య ఫిర్యాదు చేసింది.
అయితే ఈ కేసులపై ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తన భార్య తనను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే తెలిపారు. తనను మానసికంగా వేదిస్తున్నట్లు నవంబర్ రెండో తేదీన పోలీసు ఫిర్యాదు చేసిట్లు ఉమంగ్ సింగార్ తెలిపారు. ఓ కేసులో తనను ఇరికించి, తన భార్యే పది కోట్లు డిమాండ్ చేస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు. గతంతో మంత్రిగా చేసిన ఉమంగ్ సింగార్కు చాలా మంది భార్యలు ఉన్నట్లు ఆయనపై ఫిర్యాదు ఉంది.