బెంగుళూరు: శ్రీ రామనవమి రోజున మటన్ అమ్మకాలపై కర్నాటక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆ రోజున జంతు బలిని కూడా నిషేధించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించనున్నట్లు మాంసం విక్రయదారులు చెబుతున్నారు. మటన్ రిటేల్ షాపు ఓనర్లు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, రేపు మాంసాన్ని విక్రయించమని బెంగుళూరుకు చెందిన వ్యాపారి జమ్రూద్ తెలిపారు.