న్యూఢిల్లీ: జనవరి ఒకటి నుంచి ఏడో తేదీ వరకు దేశవ్యాప్తంగా స్కూళ్లలో సూర్య నమస్కార కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవ 75వ వార్షికోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు స్కూళ్లలో సూర్య నమస్కారాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు వ్యతిరేకించింది. సూర్య నమస్కారాలు అంటే సూర్యుడిని పూజించడమే అని, ఇస్లామ్ మత ధర్మాలకు ఇది విరుద్ధమని ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు ఓ లేఖలో తెలిపింది.