న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: మనుషుల్లాగే పుట్టగొడుగులు కూడా మాట్లాడుకొంటాయని, ముచ్చట్లు చెప్పుకొంటాయని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లండ్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలింది. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మాట్లాడుకొంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ సిగ్నళ్లను శాస్త్రవేత్తలు గణిత విశ్లేషణ పద్ధతి ద్వారా విశ్లేషించారు. అచ్చం మనుషుల మాటల్లాగే ఈ సిగ్నళ్ల ప్రవాహం ఉన్నట్టు గుర్తించారు. అధ్యయనాన్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్లో ప్రచురించారు.