Heart Attack | చెన్నై : మస్కట్ – చెన్నై విమానంలో ఓ ప్రయాణికుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన కే ధనశేకరణ్ మస్కట్లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
సొంతూరుకు వచ్చేందుకు మస్కట్ నుంచి ఆదివారం చెన్నైకి బయల్దేరాడు. చెన్నైలో విమానం ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులంతా దిగిపోయారు. కానీ ధనశేకరణ్ మాత్రం బయటకు రాలేదు. విమానంలోనే కుప్పకూలిపోయిన ధనశేకరణ్ను సిబ్బంది గుర్తించి, ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు.
ఎయిర్పోర్టు ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ధనశేకరణ్ను పరీక్షించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ధనశేకరణ్ డెడ్బాడీని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతని కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు సమాచారం అందించారు.