ముంబై: ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్తో కలిసి సంయుక్తంగా ఆలయ నిర్వహణ (టెంపుల్ మేనేజ్మెంట్) కోర్సులను ఆఫర్ చేయబోతున్నామని ముంబయి యూనివర్సిటీ ప్రకటించింది. ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని శనివారం ప్రకటించిం ది.
రెండు వర్సిటీలు సంయుక్తంగా డిప్లొమా, సర్టిఫికెట్ స్థాయిలో ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో కోర్సులు అందజేస్తున్నట్టు తెలిపాయి. సెంటర్ ఫర్ హిందూ స్టడీస్, సంస్కృత విభాగాలు ఆక్స్ఫర్డ్ సెంటర్ ఫర్ హిందూ స్టడీస్తో ఎంవోయూ కుదుర్చుకున్నాయని ముంబయి వర్సిటీ తెలిపింది. హిందూ తత్వశాస్త్రంపై సమగ్ర అధ్యయనానికి డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు దోహదపడతాయని తెలిపింది.