ముంబయి : మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 4వ తేదీ వరకు పొడిగిస్తూ పీఎంఎల్ఏ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో మంత్రికి బెడ్, పరుపు, కుర్చీని అందించడానికి కోర్టు అనుమతిచ్చింది. ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు చేసుకున్న దరఖాస్తును కోర్టు పెండింగ్లో పెట్టింది. మళ్లీ విచారణ తేదీ సమయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన కేస్టులో అరెస్ట్ అవగా.. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఆయనను ఫిబ్రవరి 23న అధికారులు అరెస్టు చేయగా.. గతవారం బొంబాయి హైకోర్టుకు బెయిల్, జ్యుడీషియల్ కస్టడీ నుంచి విడుదల చేసేందుకు నిరాకరించింది.