Cyber Crime | ముంబై: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నట్లు తెలిసేసరికి రిటైర్డ్ షిప్ కెప్టెన్ (75) రూ.11.16 కోట్లు పోగొట్టుకున్నారు. ఆయన మొబైల్ నంబరును ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆగస్టు 19న ఓ వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఓ ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేరుతో స్కామర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు. బాధితుడు రూ.11.16 కోట్లు అనేక బ్యాంకు ఖాతాలకు పంపించారు. తర్వాత బాధితునికి మోసపోయానని అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.