ముంబై: బలవంతపు వసూళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజేకు.. ఎస్ప్లానడే కోర్టు ఈ నెల 13 వరకు పోలీస్ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించి సచిన్ వాజే వాంగ్మూలం నమోదు చేయాలని, అందుకోసం ఆయనను 10 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టును కోరడంతో.. కోర్టు అందుకు అంగీకారం తెలిపింది. దాంతో పోలీసులు ఈ నెల 8న సచిన్ వాజే వాంగ్మూలం నమోదు చేసే అవకాశం ఉన్నది.
ఇటీవల నవంబర్ 1న కూడా ఎస్ప్లానడే కోర్టు సచిన్ వాజేను ఆరు రోజులు (నవంబర్ 6 వరకు) పోలీస్ కస్టడీకి అప్పగించింది. అయితే పోలీసులు మరో 10 రోజుల కస్టడీ కోరడంతో తాజాగా మరోసారి పోలీస్ కస్టడీకి అనుమతించింది. బలవంతపు వసూళ్ల కేసులో జూలై 23న సచిన్ వాజేతోపాటు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ తదితరులపై గోరేగావ్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.