ముంబై : శివసేన నేత సంజయ్ రౌత్కు ముంబై సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు గురువారం సమన్లు జారీ చేసింది. జూలై 4న కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. బీజేపీ నేత కిరీట్ సోమయ్య సతీమణి మేధా సోమయ్య దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ మేరకు కోర్టు సమన్లు ఇచ్చింది. మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, నిర్వహణలో తన భర్త రూ.100కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో కిరీట్ సోమయ్యతో పాటు ఆయన సతీమణి మేధా ప్రమేయం ఉందంటూ రౌత్ ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా రౌత్ స్పందించకపోవడంతో మే 23న కోర్టులో సంజయ్ రౌత్పై రూ.100కోట్ల పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే కోర్టు సమన్లు జారీ చేసింది.