పర్యాటకుల సందర్శనార్థం రాష్ట్రపతి భవన్లోని మొగల్ గార్డెన్ ఈ నెల 12 నుంచి మార్చి 16 వరకూ అందుబాటులో వుంటుందని రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే అడ్వాన్స్ ఆన్లైన్ బుకింగ్ మాత్రం చేసుకున్న వారికి మాత్రమే మొగల్ గార్డెన్స్ సందర్శనం కోసం అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. https://rashtrapatisachivalaya.gov.in లేదా https://rb.nic.in/rbvisit/visit_plan.aspx లింక్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ సందర్శకులను అనుమతిస్తామని రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సాయంత్రం 4 గంటల తర్వాత మాత్రం సందర్శకులకు అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అయితే కరోనా దృష్ట్యా సందర్శకులందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని కోరారు. విధిగా మాస్క్ ధరించాలని, మాస్క్ లేని వారికి ప్రవేశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.