న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం ప్రవేశపెట్టి 8 ఏండ్లు పూర్తయ్యాయని, దీని కింద ఇచ్చిన రుణాల్లో 83 శాతం రూ.50 వేల లోపువే కావడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం పేర్కొన్నారు.
ఇంత చిన్న మొత్తంతో ఏ రకమైన వ్యాపారం చేయగలుగుతారని ఆయన ప్రశ్నించారు. ఈ పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎనిమిదేండ్ల కాలంలో 40.62 కోట్ల మంది లబ్ధిదారులకు రుణాలు అందజేశారు. కార్పొరేటేతర, చిన్న వ్యాపారులు తమ వ్యాపారాభివృద్ధికి, కొత్త వ్యాపారాలు చేయడానికి ఈ పథకం కింద ప్రభుత్వం వివిధ బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణంగా అందజేస్తుంది.