Priyanka Chaturwedi : కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్కు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతూనే వుంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీయే నిట్టనిలువునా చీలిపోయింది. గాంధీ పరివారానికి విధేయులుగా ఉండేవారు చురుకులు అంటించగా, జీ 23 అంటూ అధిష్ఠానంపై తిరుగుబాటు బావుటా ఎగేరేసిన సమూహం మరోవైపు. అయితే జీ 28 వర్గం మాత్రం పద్మ అవార్డు ప్రకటించడాన్ని స్వాగతించింది. ఇలా రెండు వర్గాలు విమర్శలు చేసుకుంటుంటే, అధిష్ఠానం మాత్రం ఏమీ మాట్లాడలం లేదు. తాజాగా ఈ గొడవలోకి శివసేన వచ్చి దూరింది. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. అయితే ఆమె పరోక్షంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్పై విరుచుకుపడ్డారు.
‘జాతీయ గౌరవాన్ని తగ్గిస్తూ విమర్శలు చేయడం ఏమీ బాగోలేదు. పద్మ అవార్డు ద్వారా గులాంనబీ ఆజాద్ గులాంలా కావొద్దనడం సరైన వ్యాఖ్య కాదు. వారి ఆలోచన ఎంత నిస్సారంగా వుందో అర్థం చేసుకోవచ్చు. జాతీయ పురస్కారం విషయంలో వారి ఆలోచనా విధానం తెలుస్తోంది. ప్రతిపక్ష నేతలకు ఇలాంటి గౌరవ పురస్కారాలు ఇవ్వడం ఇదే తొలి సారీ కాదు. చివరిసారీ కాదు. దయచేసి స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నాను’ అంటూ ప్రియాంక చతుర్వేదీ కాంగ్రెస్లోని ఓ వర్గంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్కు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడంపై అదే పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ కొంత ఘాటుగానే స్పందించారు. గులాంనబీ ఆజాద్ గులాంలా కాకుండా ఆజాద్లా వుండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అయితే కేంద్రం ఈ అవార్డును ప్రకటించడం మాత్రం సరైనదేనని, అయితే ఆయన ఆజాద్లా వుండాలని జైరాం వ్యాఖ్యానించారు.