ముంబై, జూన్ 8: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ నవ్నీత్ కౌర్కు బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయడంతో పాటు తప్పుడు పత్రాలు సృష్టించినందుకు రూ. 2 లక్షల జరిమానా విధించింది. నవ్నీత్ కౌర్.. నకిలీ ధ్రువపత్రాలతో ఎంపీగా గెలిచారని ఆరోపిస్తూ శివసేన మాజీ ఎంపీ ఆనందరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఎంపీగా పోటీ చేయడానికి ఆమె తప్పుడు ధ్రువపత్రాలను సృష్టించినట్టు నిర్ధారించింది. కుల ధ్రువీకరణపత్రం తీసుకోవడానికి దాఖలుచేసిన ధ్రువపత్రాలను రెండు వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. అమరావతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కాగా.. నవ్నీత్ కౌర్ షెడ్యూల్డ్కులాలకు చెందిన వ్యక్తి కాదనేది ఆనందరావు ఆరోపణ.