న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, పశ్చిమ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తితో ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలోని వివేకానంద పార్కులో గంభీర్ మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ.. ఇది అద్భుతమైన కార్యక్రమని, ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. ఇంతమంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరు ఒక్కో మొక్క నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్దామన్నారు. త్వరలోనే ట్విట్టర్ వేదికగా మరో ముగ్గురికి సవాల్ విసురుతానని వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి రాఘవ.. గౌతమ్ గంభీర్కు వృక్ష వేదం పుస్తకాన్ని బహూకరించారు.