భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ మంగూభాయ్ పటేల్కు అందజేశారు. మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇవాళ బీజేపీ అధిష్ఠానం మోహన్ యాదవ్ పేరును ఖరారు చేయడంతో.. శివరాజ్ రాజీనామా సమర్పించారు. మోహన్ యాదవ్ తన పాలనతో రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని ఈ సందర్భంగా శివరాజ్ ఆకాంక్షించారు.
కొత్త ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు తన ట్విటర్ (X) హ్యాండిల్ ద్వారా శివరాజ్సింగ్ శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, మోహన్ యాదవ్ను మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నిక చేయడం ద్వారా బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు ఆరుగురు సీనియర్లు సీఎం పదవిని ఆశిస్తూ పావులు కదుపుతుంటే.. వాళ్లందరినీ పక్కన పెట్టేసి బీజేపీ మోహన్ యాదవ్కు సీఎం పదవి కట్టబెట్టింది. ఊహించని విధంగా సీఎంను చేసి మోహన్ యాదవ్ను ఆశ్చర్చపర్చింది.