భోపాల్: ఒక బీజేపీ నాయకురాలు మాస్క్ లేకుండా మీడియా కంటపడ్డారు. దీంతో మాస్క్ ధరించాలంటూ ఒకరు ఇవ్వగా ఆమె కారులో వెళ్తూ దానిని బయట పడేశారు. మధ్యప్రదేశ్లోని డాటియా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. కరోనా మరోసారి తీవ్రంగా వ్యాపిస్తుండటంతో మాస్కులు ధరించని వారికి ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు వాటిని పంపిణీ చేస్తున్నారు.
ఇంతలో బీజేపీ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఇమర్తి దేవి కారులో అటుగా వెళ్తున్నారు. ఆమె మాస్క్ ధరించకపోవడాన్ని గమనించిన ఆప్ వాలంటీర్లు కారును ఆపారు. ఒక మాస్క్ను ఆమెకు ఇచ్చి ధరించాలని సూచించారు. అయితే కారు కదులుతుండగా ఆ మాస్క్ను ఆమె బయట పడేశారు. కాగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.