కోల్కతా: బంగ్లాదేశ్ అధికార పార్టీ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీం అనర్ కోల్కతాలో హత్యకు గురయ్యారు. అన్వరుల్ ఈ నెల 12న కోల్కతాకు వచ్చారు. ఆ మర్నాడు వైద్య పరీక్షల కోసం మిత్రులతో కలిసి బిధాన్ నగర్లో ఓ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత కనిపించలేదు. తన తండ్రి ఫోన్ తీయ డం లేదని బంగ్లాదేశ్లో ఉన్న ఆయన కుమార్తె ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో బారానగర్ పోలీస్ స్టేషన్లో 18న ఫిర్యాదు చేశారు. అన్వరుల్ మృతదేహాన్ని పోలీసులు న్యూటౌన్లో గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు బంగ్లా దేశీయులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసును సీఐడీకి అప్ప ంచినట్టు అధికారులు చెప్పారు.