భోపాల్: గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ భౌతికకాయం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని ఆయన నివాసానికి చేరింది. తమిళనాడులో ఇటీవల జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది రక్షణ సిబ్బంది మరణించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్. కాగా, బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం చనిపోయారు. ఈ నేపథ్యంలో భౌతికకాయాన్ని గురువారం భోపాల్కు తీసుకువచ్చారు. సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్తోపాటు పలువురు ఈ సందర్భంగా గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఇంటికి చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబంతో సంప్రదించిన తర్వాత ఏదైనా ఇన్స్టిట్యూట్కు వరుణ్ సింగ్ పేరు లేదా విగ్రహం ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.కోటి నగదుతోపాటు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు.