తిరువనంతపురం : మంకీపాక్స్ లక్షణాలతో కేరళకు చెందిన 22 సంవత్సరాల యువకుడు ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. సోమవారం టెస్టుల ఫలితాలు వెలువడగా.. మంకీపాక్స్ పాజిటివ్గా తేలిందని అధికార వర్గాలు తెలిపాయి. సదరు యువకుడు ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. నమూనాలను జూలై 19న యూఏఈలో సేకరించగా.. 21న భారత్కు తిరిగి వచ్చాడు. 27న త్రిసూర్లోని ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆ యువకుడి నమూనాలను సేకరించి పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి పంపగా.. సోమవారం రిపోర్టుల్లో పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం ఇచ్చారు.
అయితే, యూఏఈలో సేకరించిన నమూనాల్లోనూ పాజిటివ్గా తేలినట్లు తెలిసింది. యువకుడి మృతి నేపథ్యంలో 20 మందిని ప్రస్తుతం క్వారంటైన్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులు సహా అందరినీ క్వారంటైన్లో ఉంచినట్లు పేర్కొన్నారు. అయితే, మృతుడికి కేవలం పది మందితోనే కాంటాక్ట్ ఉన్నదని అధికారులు ధ్రువీకరించారు. ప్రస్తుతం భయాందోళనపడాల్సింది ఏమీ లేదని, ఇప్పటివరకు 20 మందిని ఐసోలేషన్లో ఉంచినట్లు ఆరోగ్యశాఖ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు రెంజిని తెలిపారు.