సెలవును సవరించిన కేంద్రం
హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): మొహర్రంను ఈ నెల 20న జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన జామామసీద్ ఇమా మ్ వెల్లడించారు. మొహర్రం సందర్భంగా ఈ నెల 19న ప్రభుత్వం సాధారణ సెలవుగా గతంలోనే ప్రకటించింది. జామామసీద్కు చెంది ఇమామ్ 20న మొహర్రం జరుపుకోవాలని సూచించడంతో.. కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ కార్యదర్శి ఎస్పీ పంత్ ఆగస్టు 20న సెలవుదినంగా ప్రకటించారు.