Mohan Yadav : కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార కేసు వ్యవహారంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లక్ష్యంగా కాషాయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటన విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకరించాలని మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ ఘటన తీవ్రంగా ఖండించదగినదని, తీవ్ర విచారకరమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు మహిళా సీఎం సారధ్యంలోని పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న పరిణామాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో దారుణ ఉదంతం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద, సుభాష్ చంద్ర బోస్, రవీంద్ర నాథ్ ఠాగూర్ వంటి మహనీయులు జన్మించిన నేలపై ఇంతటి నీచమైన నేరం జరగడం విస్మయం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోల్కతాలో వైద్యరాలిపై హత్యాచార ఘటన సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని, అక్కడ గూండాలు డాక్టర్లపై దాడిచేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు సరైన రీతిలో బెంగాల్ అధికారులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, కోల్కతాలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యురాలి హత్యాచార కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనలో మమతా బెనర్జీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆరోపించారు.
Read More :
Remuneration | ఆ హీరో ఏడు కోట్లు డిమాండ్ చేస్తున్నాడు!