భోపాల్/రాయ్పూర్/జైపూర్, డిసెంబర్ 13: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్, ఛత్తీస్గఢ్ సీఎంగా విష్ణు దేవ్ సాయ్ ప్రమాణస్వీకారం చేశారు. బుధవారం మోహన్ యాదవ్ చేత గవర్నర్ మంగూభాయ్ పటేల్ ప్రమా ణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా జగదీశ్ దేవ్డా, రాజేంద్ర శుక్లా కూడా ప్రమాణస్వీకారం చేశారు.
అలాగే ఛత్తీస్గఢ్లోనూ సీఎంగా విష్ణుదేవ్ సాయి, డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సాహో, విజయ్ శర్మ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. రెండు రాష్ర్టాల్లో జరిగిన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాలకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నడ్డా తదితరులు హాజరయ్యారు. ఇక రాజస్థాన్ సీఎంగా ఎన్నికైన భజన్లాల్ శర్మ, ఉప ముఖ్యమంత్రులు దియా కుమారి, ప్రేమ్చంద్ బైర్వా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.