న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: భారత్ను ప్రపంచానికి తయారీహబ్గా మారుస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచారార్భాటంతో ఎనిమిదేండ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇం డియా’ ఘోరంగా విఫలమయ్యింది. ఈ వైఫల్యాన్ని ఇప్పటివరకూ గణాంకాలు ఎత్తిచూపుతున్నప్పటికీ, తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా దీనిని అంగీకరించారు. తాము ఎన్ని చేసినా దేశీయ తయారీ రంగంలో పెట్టుబడులు ఎందుకు పెట్టడం లేదంటూ ఆమె కార్పొరేట్లను ప్రశ్నించారు. మంగళవారం జరిగిన మైండ్మైన్ సమ్మిట్లో మాట్లాడుతూ.. ‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఏమి ఆపుతున్నదో తెలుసుకోవాలనుకుంటున్నా, మీకు ఆత్మ విశ్వాసం లేదా?’ అంటూ ప్రశ్నించారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం పరిశ్రమలకు కావాల్సినవి అన్నీ చేసిందని, స్కీములు ఇచ్చామని సీతారామన్ చెప్పారు. పీఎల్ఐ స్కీ ములు అమలు చేశామని, పన్నులు తగ్గించామ ని అన్నారు. ఇది ఇంతటితో ఇదే అంతం కాద ని, కార్పొరేట్లకు మరింత మద్దతునిస్తామంటూ బతిమలాడారు.
పెన్సిళ్ల దగ్గర్నుంచి చిన్న ఉత్పత్తులపై కూడా జీఎస్టీ పేరుతో పన్నులు పెంచేశారని, చివరికి నిత్యావసరాల్ని కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చారని, దీంతో ప్రజల్లో కొనుగోలు శక్తి పడిపోయి వస్తూత్పత్తులకు డిమాండ్ లేకుండా పోయిందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉత్పాదక రంగంలో కొత్త పెట్టబడులు కరువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది జూలై నెలలో తయారీ రంగ వృద్ధి 10 నెలల కనిష్ఠస్థాయికి పడిపోయింది. మరోవైపు అధిక ద్రవ్యోల్బణంతో సరుకుల కొత్త ఆర్డర్లకు, ఉత్పత్తికి డిమాండ్ స్తంభించిపోయిందని ఆంబ్రేన్ ఇండియా డైరెక్టర్ సచిన్ రెల్హాన్ తెలిపారు. అలాగే ఆర్థిక మందగమనం, అధిక ద్రవ్యోల్బణం కారణంగా విదేశాల్లో వస్తూత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. అటు విదేశాల్లో ఉత్పత్తులకు గిరాకీ లేకపోగా.. దేశంలో ఉన్న డిమాండ్ను కాస్తా అధిక పన్నులతో కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేసింది.
దిగుమతి, ఎగుమతి సుంకాల విధింపులో హడావుడి నిర్ణయాలు తీసుకోవడంతో ఆయా తయారీ రంగాలు దెబ్బతింటున్నాయి. చైనా తయారీ రంగ విస్తరణకు, వృద్ధికి కారణమైన ప్రాసెసింగ్, అసెంబ్లింగ్ రంగం అభివృద్ధికి విఘాతం కల్పిస్తూ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ పరికరాలపై దిగుమతి సుంకాల్ని కేంద్రం రెట్టింపు చేసేసింది. దీంతో తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశాన్ని పోగొట్టుకుందని పరిశ్రమ నిపుణులు చెప్పారు. అలాగే ఆర్టిఫిషియల్ ఫైబర్స్, ఫ్యాబ్రిక్స్పై 20-25 శాతం మేర అధిక ఎగుమతి సుంకాల్ని విధించడంతో సింథటిక్-ఫ్యాబ్రిక్ గార్మెంట్స్ ఎగుమతులు తగ్గిపోయాయి. ఆటొమొబైల్స్ వంటి తుది ఉత్పత్తులపై 60-125 శాతం మేర దిగుమతి సుంకాల విధింపుతో ఈ పరిశ్రమలు ప్రపంచ మార్కెట్లో పోటీతత్వాన్ని కోల్పోయాయి. ఇలాంటి విధానాలతో తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు కార్పొరేట్లు వెనుకంజ వేస్తున్నాయి.
తయారీ లక్ష్యాలు హుళక్కి
ప్రధాని మోదీ 2014లో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రచారంతో ఊదరగొట్టారు. మూడు ప్రధాన లక్ష్యాలతో ఈ కార్యక్రమం ఆరంభమయ్యింది. అవి.. 1. తయారీ రంగ వృద్ధిని 12-14 శాతానికి పెంచడం 2. జీడీపీలో తయారీ రంగం వాటాను 2022కల్లా 16 శాతం నుంచి 25 శాతానికి పెంచడం 3. ఈ రంగంలో 2022కల్లా 10 కోట్ల ఉద్యోగాల్ని కల్పించడం. కానీ గత ఎనిమిదేండ్లలో తయారీ రంగ వృద్ధి రేటు 6 శాతానికే పరిమితమయ్యింది. జీడీపీలో ఉత్పాదక రంగం వాటా 16 శాతం వద్దే స్థిరపడిపోయింది. ఈ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన సంగతి అటుంచి సగం మంది ఉపాధి కోల్పోయారు. తాజాగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం 2022 జూలైలో దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు 2.4 శాతానికి పడిపోయింది. తయారీ రంగం వృద్ధి 3.3 శాతానికే పరిమితమయ్యింది.