66% నుంచి 24 శాతానికి పడిపోయిన జనాదరణ
మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 16: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతున్నది. తర్వాతి ప్రధాని ఎవరయితే బాగుంటుందని ఇండియా టుడే మ్యాగజైన్ ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో పాల్గొన్నవారిలో మోదీకి కేవలం 24 శాతం మందే ఓటేశారు. ఇది గతేడాది ఆగస్టులో 66 శాతంగా ఉన్నది. 11శాతం ఓట్లతో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి 10 శాతం ఓట్లు వచ్చాయి. గతేడాదితో పోల్చితే మోదీకి జనాదరణ బాగా తగ్గిపోగా.. రాహుల్, యోగికి మద్దతు పెరిగింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే మోదీ ప్రభ తగ్గడానికి ప్రధాన కారణంగా నిలిచింది.