Amit Shah | దేశాభివృద్ధికి, శాంతిభద్రతలు, యువత ఉజ్వల భవిష్యత్కు నక్సలిజం అతిపెద్ద శత్రువు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్ కౌంటర్ లో 29 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులతో జరిగిన ఎన్ కౌంటర్లలో ఇదే అతిపెద్దది. భద్రతా బలగాలు జరిపిన ఈ ఆపరేషన్ విజయవంతంగా సాగిందని అమిత్ షా పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది దైర్య సాహసాలను ప్రశంసించారు.
దేశానికి నక్సలిజం నుంచి విముక్తి కల్పించాలని ప్రధాని మోదీ సంకల్పించారని అమిత్షా తెలిపారు. నక్సలిజం ప్రస్తుతం ఒక చిన్న ప్రాంతానికి పరిమితం అని, త్వరలో ఛత్తీస్ గఢ్ తోపాటు దేశమంతా నక్సల్స్ రహితంగా మారుతుందన్నారు. గాయపడిన బీఎస్ఎఫ్ జవాన్లు త్వరగా కోలుకోవాలని ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పేర్కొన్నారు.