న్యూఢిల్లీ, ఫిబవ్రరి 6: భారత్-మయన్మార్ మధ్య ఉన్న 1,643 కిలోమీటర్ల సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం వెల్లడించారు. ఇప్పటివరకు ఇరు దేశాల సరిహద్దులోని ప్రజలు 16 కిలోమీటర్ల పరిధి వరకు ఎలాంటి దస్ర్తాలు లేకుండా అటు ఇటు స్వేచ్ఛగా సంచరించే అవకాశం ఉంది.
కంచె నిర్మాణం ద్వారా ఈ సంచారానికి అడ్డుకట్ట పడనుంది. సరిహద్దుల ద్వారా గిరిజన ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశిస్తున్నారని.. మత్తు పదార్థాలు కూడా దొంగ రవాణా అవుతున్నాయని మైతీలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో కంచె నిర్మించాలని చాలా కాలంగా వారు డిమాండ్ చేస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లోనూ అవసరమైన చోట కంచె నిర్మిస్తున్నట్టు షా వెల్లడించారు.