న్యూఢిల్లీ, ఆగస్టు 24: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థులకు నమ్మక ద్రోహం చేసిందని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సోమవారం ఆరోపించింది. జూలై 25న విద్యార్థులు ఉద్యమాన్ని ఉపసంహరించుకునేందుకు దారితీసిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపిస్తూ సెప్టెంబర్ 5న ఢిల్లీలోని ఇండియా గేట్ నుంచి న్యూఢిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయం వరకు యువజన నిరసన ర్యాలీని నిర్వహించనున్నామని సీజేపీ ప్రకటించింది.
ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలు, జూలై 20 నాటి పోలీసుల చర్యలకు గురైన బాధితులు ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తారన్నారు. జెఎన్-జీకి, యువ నిరసనకారులకు,. మరణించిన వారి కుటుంబాలకు జరిగిన ఈ నమ్మక ద్రోహాన్ని అంగీకరించేది లేదు. మోదీ ప్రభుత్వానికి జవాబుదారీ తనం లేదని వారి విధానాలతో ఒప్పుకున్నారు అని సౌరవ్ హెచ్చరించారు.