హైదరాబాద్ : భారీగా గంజాయి తరలిస్తూ గత సంవత్సరం ’మిసెస్ కేరళ’ (Mrs Kerala 2025) రన్నరప్, మోడల్ హర్ష సన్నీ (28) ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుండి ముంబై వచ్చిన ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు హర్ష(Harsha Sunny) లగేజీని చెక్ చేశారు. అందులో రూ. 11.82 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి (సుమారు 11 కిలోలకు పైగా) పట్టుబడింది.
భారతదేశంలోకి నిషేధిత మాదకద్రవ్యాలను అక్రమంగా తరలించడానికి ప్రయత్నించిన ఆరోపణలపై కస్టమ్స్ అధికారులు హర్ష సన్నీని ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టు స్వాధీనం చేసుకున్న హైడ్రోపోనిక్ గంజాయి బరువు 11 కేజీలకు పైగా ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ. 11.82 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. సన్నీని ముంబైలోని ఫోర్ట్ కోర్టులో హాజరుపరచగా కోర్టు ఆమెకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.