వారణాసి, ఏప్రిల్ 22: పెట్రోల్, నిమ్మకాయల ధరలు మండిపోతుండటంతో ఓ సెల్ఫోన్ దుకాణాదారుడు వినూత్నంగా ఆలోచించాడు. ఫోన్ విడిభాగాలు కొంటే వీటిని ఉచితంగా అందజేస్తామని బోర్డు పెట్టాడు. ప్రధాని మోదీ సొంత నియోజకవర్గమైన వారణాసిలో ఈ ఉచిత ఆఫర్ పాపులర్ అయ్యింది.
రూ.10 వేలకుపైగా విలువైన ఉపకరణాలను కొంటే లీటరు పెట్రోల్ ఉచితమట. ధరతో నిమిత్తం లేకుండా ఏ ఉపకరణం కొన్నా 2-4 నిమ్మకాలు ఇస్తాడట.