శ్రీనగర్: జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని పూంచ్, రాజౌరీ జిల్లాల్లో ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు. అక్కడ ఉగ్రవాదుల కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ సాగుతోంది. సీనియర్ ఆర్మీ, పోలీసు ఆఫీసర్లు ఆ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. సున్నిత ప్రదేశాల్లో అదనపు బలగాలు, పారామిలిటరీ దళాలను మోహరించారు. ఉగ్రవాదుల ఆనవాళ్లను గుర్తించేందుకు ఆ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. ఇటీవల రెండు ఆర్మీ వాహనాలపై జరిగిన దాడిలో అయిదురు జవాన్లు మృతిచెందిన విషయం తెలిసిందే. మొబైల్ సేవల్ని నిలిపి వేసి.. విస్తృత స్థాయిలో రెండు జిల్లాల సరిహద్దుల వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్నారు.