గువాహటి, ఆగస్టు 7: మణిపూర్ వ్యాప్తంగా ఐదురోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను సస్పెండ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. బిష్ణుపూర్ జిల్లాలో శనివారం సాయంత్రం నలుగురు వ్యక్తులు ఓ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. స్థానిక దుకాణాలను మూయించారు. ఈ చర్యలు మత ఘర్షణలకు దారితీయవచ్చని అనుమానించిన పోలీసులు ఇంటర్నెట్ సేవలను రద్దు చేశారు. కాగా కొండప్రాంతాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలంటూ తీసుకొచ్చిన మణిపూర్ (హిల్ ఏరియాస్) అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ బిల్లు, 2021ను వెంటనే అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్యూఎం) గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నది. ఈక్రమంలోనే ఆ యూనియన్ సభ్యులు బైక్కు నిప్పుపెట్టినట్టు అనుమానిస్తున్నారు.