మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కేంద్రహోంమంత్రికి లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను నిషేధించాలంటూ ఎంఎన్ఎస్ ఆ లేఖలో డిమాండ్ చేసింది. లౌడ్ స్పీకర్ల విషయంలో సుప్రీం కోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించేలా కేంద్రం చూడాలని, మసీదుల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఎమ్ఎన్ఎస్ కేంద్ర హోంమంత్రిని కోరింది.
ఉద్ధవ్ నేతృత్వంలోని మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం మే 3 లోపు లౌడ్ స్పీకర్లపై తుది నిర్ణయం తీసుకోవాలని ఎమ్ఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ థాకరే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. లేదంటే తాము లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాలను ప్లే చేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే తాము ఎవ్వరికీ వ్యతిరేకం కాదని, తమ తమ విశ్వాసాలను నివాసాల్లోనే చూపించుకోవాలని రాజ్ థాకరే పేర్కొన్న విషయం తెలిసిందే.