ప్రగతిశీల సమాజ్వాదీ అధ్యక్షుడు, అఖిలేశ్ బాబాయ్ శివపాల్ యాదవ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో భేటీ అయ్యారు. 20 నిమిషాల పాటు వీరిద్దరి భేటీ జరిగింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జస్వంత్ నగర్ నుంచి బరిలోకి దిగి, విజయం సాధించారు. బుధవారమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అయితే ఈ భేటీ కి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని, మర్యాద పూర్వకంగానే సీఎం యోగితో భేటీ అయ్యారని ఆయన ఆంతరంగికులు ప్రకటించారు.
సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్పై బాబాయ్ శివపాల్ యాదవ్ మళ్లీ అలిగారు. ఎన్నికల ఫలితాల తర్వాత ములాయం ఇంట్లో హోళీ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ములాయం కుటుంబీకులు అందరూ హాజరయ్యారు. శివపాల్ కూడా హాజరయ్యారు కానీ.. అఖిలేశ్తో ఏమీ మాట్లాడలేదు. అఖిలేశ్పై బాబాయ్ శివపాల్ మళ్లీ అలిగారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా నూతనంగా ఏర్పడిన ఎమ్మెల్యేలతో అఖిలేశ్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ భేటీకి శివపాల్ను కూడా ఆహ్వానించారు. అయితే శివపాల్ ఈ భేటీకి డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలో సీఎం యోగితో శివపాల్ భేటీ కావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.