Mizoram | ఐజ్వాల్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మిజోరం సీఎం లాల్దుహోమా కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కొత్త కార్లు ఇవ్వటం లేదని, పాత కార్లే వాడుకోవాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ విధానానికి అనుగుణంగా మంత్రులు, వివిధ శాఖల ఉద్యోగులు నడుచుకోవాలని కోరారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఎమ్మెల్యేల కార్లు కొనుగోలుకు నిధులు విడుదల చేయటం లేదు. కొత్త ప్రభుత్వంలోని మంత్రులకు కూడా ఇదే వర్తిస్తుంది. పాత మంత్రులు వాడిన వాహనాల్నే కొత్త మంత్రులకు ఇస్తాం’ అని అన్నారు.