లక్నో: ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. వారిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు చెరకు పొలాల వద్ద వదిలేశారు. ఒక బాలుడ్ని సంచిలో కుక్కి అక్కడ పడేశారు. (Child Stuffed Inside Sack) కట్టేసి ఉన్న ఆ సంచిలో సజీవంగా ఉన్న బాలుడ్ని గుర్తించిన కుటుంబ సభ్యులు బయటకు తీశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఎఘరా గ్రామంలో పొరుగున ఉండే రెండు కుటుంబాలకు చెందిన నాలుగేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు అంగన్వాడీ కేంద్రం నుంచి ఇంటికి వెళ్తుండగా దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ పిల్లలను చెరకు పొలాల వద్దకు తీసుకెళ్లారు. ఒక బాలుడ్ని సంచిలో కుక్కి అక్కడ వదిలేశారు.
కాగా, పిల్లలు ఇంటికి రాకపోవడంతో రెండు కుటుంబాల వారు ఆందోళన చెందారు. గ్రామంలో ఎక్కడా కనిపించకపోవడంతో సమీపంలోని చెరకు పొలాల వద్ద వెతికారు. ఏడ్పు శబ్దం విని ఒక బాలుడ్ని సంచిలో కుక్కి ఉండటాన్ని గమనించారు. సజీవంగా ఉన్న ఆ బాలుడ్ని ఆ సంచి నుంచి బయటకు తీశారు. కొంత దూరంలో కూర్చొని ఉన్న మరో బాలుడ్ని కూడా గుర్తించారు.
మరోవైపు రెండు కుటుంబాలు తమ పిల్లల కిడ్నాప్ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితులైన రాకేష్, అతడి కుమారుడు నర్వీర్ను అరెస్ట్ చేశారు. తమ పిల్లలను అమ్మేందుకు కిడ్నాప్ చేసి ఉంటారన్న కుటుంబ సభ్యుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఒక బాలుడ్ని సంచి నుంచి బయటకు తీసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“बाल-बाल बच गया यह बच्चा”
लखीमपुर खीरी के उचौलिया इलाके से कल दो बच्चो का बदमाशों ने बोरी में बंद कर अपहरण कर लिया। अपहरण की खबर से इलाके में हड़कंप मच गया। ग्रामीणों ने पुलिस के सहयोग से तलाशी शुरू की तो गन्ने के खेत से रोने की आवाज आई। बोरा खोलकर बच्चे को मुक्त कराया गया। pic.twitter.com/9lEgyLAxB8
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 8, 2023