అహ్మదాబాద్: గుజరాత్లోని ఖేడా జిల్లాలో ఉన్న ఉన్దేలా గ్రామంలో కొంత మంది ముస్లిం యువకుల్ని పోల్కు కట్టేసి పోలీసులు(Gujarat Flogging: లాఠీలతో చితక్కొట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు చెందిన వీడియోలు కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. ఆ గ్రామంలో జరిగిన గర్భా వేడుకల్లో యువకులు అల్లరి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లను పట్టుకుని పోల్కు కట్టేసి కొట్టారు. స్థానిక జనం చప్పట్లు కొడుతుండాగా ఆ యువకుల్ని చితకబాదారు.
ఈ ఘటన పట్ల తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర డీజీపీ ఆశిష్ భాటియా విచారణకు ఆదేశించారు. యువకుల్ని లాఠీలతో కొట్టింది పోలీసులే అని ఓ నిర్ధారణకు వచ్చారు. విచారణకు ఆదేశించామని, వాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆశిష్ భాటియా తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఈ ఘటనపై రిపోర్ట్ను పోలీసులకు అందజేయనున్నారు.
గుజరాత్లోని ఓ ఎన్జీవో సంస్థ ఈ ఘటన పట్ల రియాక్ట్ అయ్యింది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో పాటు డీజీపీకి లీగల్ నోటీసులు జారీ చేసింది. బహిరంగంగా యువకుల్ని చితక కొట్టిన ఘటనలో మైనార్టీ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ ముజాహిద్ నఫీస్ కొందరు ఆఫీసర్లకు కోర్టు ధిక్కరణ నోటీసులను పంపించారు.