చండీగఢ్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన మైనర్ సభ్యులు ఒక వ్యాపారవేత్తపై కాల్పులు జరిపి హత్య చేశారు. (Bishnoi Gang Kills Man) తన కుమారుడ్ని ఏమీ చేయవద్దని అతడి తల్లి ప్రాధేయపడగా, భార్య మాత్రం పిల్లలను తీసుకుని అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. గురుగ్రామ్కు చెందిన సచిన్ ముంజాల్ బిజినెస్ చేస్తుంటాడు. ఫిబ్రవరి 29న తన కుటుంబంతో కలిసి సంగ్రూర్కు వెళ్లాడు. రాత్రి పది గంటల సమయంలో భోజనం చేసేందుకు రోహ్తక్లోని ఒక దాబా వద్ద వారు ఆగారు.
కాగా, భోజనం తర్వాత సచిన్ ముంజాల్ ముందుగా తన కారు వద్దకు వెళ్లాడు. తల్లి, భార్యతోపాటు ఇద్దరు చిన్న పిల్లలు అతడి వెనుక వస్తున్నారు. ఇంతలో తెల్లని కారులో వచ్చిన దుండగులు గన్స్తో సచిన్పై కాల్పులు జరిపారు. గమనించిన తల్లి పరుగున్న అక్కడకు వెళ్లింది. తన కుమారుడ్ని ఏమీ చేయవద్దని నిందితులను ఆమె ప్రాధేయపడింది. అయితే కాల్పుల శబ్దం విన్న సచిన్ భార్య తన పిల్లలను తీసుకుని అక్కడి నుంచి దూరంగా పరుగెత్తింది.
మరోవైపు వ్యాపారవేత్త సచిన్పై కాల్పులు జరిపి హత్య చేసిన నిందితులు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన మైనర్ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు ముందు జైపూర్లోని జువైనల్ సెంటర్ నుంచి వారు తప్పించుకుని పారిపోయినట్లు తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన రోహిత్ గోదారాకు ఈ హత్యతో ప్రమేయం ఉందని వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
मां गिड़गिड़ाती रही फिर भी तरस नहीं आया लॉरेंस के शूटर्स को, मां, पत्नी और बच्चों के सामने मारी गोली
जयपुर के बाल सुधार से भागे नाबालिगों ने किया मर्डर
29 फरवरी को रोहतक में एक ढाबे पर बिजनेसमैन को गोलियों से भूना
हत्या की जिम्मेदारी लॉरेंस बिश्नोई गैंग के रोहित गोदार ने ली… pic.twitter.com/JpVDt96yHM
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) March 8, 2024