ఉక్రెయిన్లో ఉండిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఉక్రెయిన్లో పరిస్థితులు గంభీర స్థితిలో ఉన్నాయని, అయినా భారతీయులను వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతినే కోరుకుంటుందని ఆయన పునరుద్ఘాటించారు.
భారతీయులను వెనక్కి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకుంటోందని, అయితే పరిస్థితులు అక్కడ వేరుగా ఉన్నాయన్నారు. అక్కడి భారతీయులు విమానంలో తిరిగి వచ్చేట్లుగా పరిస్థితులు లేవని, అయినా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ఓ విమానాన్ని పంపించామని, కొందరు భారత్కు క్షేమంగా చేరుకున్నారని రాజ్నాథ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఉక్రెయిన్లో గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అప్రమత్తమవుతోంది. ఎప్పటికప్పుడు అక్కడ నివసిస్తున్న భారతీయులను అలర్ట్ చేస్తూనే వుంది. ఇప్పటికే రెండు మార్లు తగు సలహాలిచ్చింది. తాజాగా మూడో సలహా కూడా ఇచ్చింది. ఎయిర్ సైరన్లు, బాంబు వార్నింగ్లు ఇచ్చే ప్రాంతంలో గనక ఉంటే… వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని ఉక్రెయిన్లోని భారతీయులకు భారత ఎంబసీ సూచించింది.