న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) లాంటి ముఖ్యమైన వేదికపై సవాళ్లను చర్చించి పరిష్కారాలను కనుగొందామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం ఎస్సీవో దేశాల రక్షణ మంత్రుల సమావేశం రాజ్నాథ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో అఫ్గనిస్థాన్లోని పరిస్థితులను సమీక్షించే అవకాశం ఉన్నదని రాజ్నాథ్ భావిస్తున్నారు. చైనా, రష్యా రక్షణ మంత్రులు, ఇతర సభ్య దేశాల సైనికాధికారులు సమావేశంలో పాల్గొన్నారు.