టెహ్రాన్ : ఇరాన్ దేశాధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసిని ఇవాళ కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కలివారు. ఇటీవల ఇరాన్ దేశాధ్యక్షుడిగా రైసి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన్ను తొలిసారి కలిసినట్లు మంత్రి జైశంకర్ తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఫోటోను పోస్టు చేశారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇరాన్ ఆసక్తిగా ఉన్నట్లు మంత్రి తెలిపారు. ప్రాంతీయ ప్రయోజనాల దృష్ట్యా ఇద్దరి మధ్య బంధం కీలకమైందన్నారు. ఇరాన్ టీమ్తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి జైశంకర్ వెల్లడించారు. దేశాధ్యక్షుడిగా ఎన్నికైన రైసి.. నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి మంత్రి జైశంకర్ హాజరయ్యారు. ఇవాళ ఆ ఇద్దరూ ప్రత్యేకంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.