చెన్నై: వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథ్ సతీమణి మీనా స్వామినాథన్ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు 88 ఏళ్లు. శిశు విద్యా రంగంలో ఆమె నిపుణురాలు. కార్యకర్త కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ రీసర్చ్ ఫౌండేషన్ చైర్మెన్గా కూడా మీనా ఉన్నారు. సహజంగానే ఆమె మరణించినట్లు ఫౌండేషన్ తెలిపింది. టీచర్గా, ఎడ్యుకేటర్గా, రైటర్గా ఆమెకు గుర్తింపు ఉన్నది. చిన్నపిల్లల విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలు రాశారు. కేంద్ర విద్యా బోర్డు అడ్వైజరీగా ఆమెను 1970లో నియమించారు. ఆమె సమర్పించిన రిపోర్ట్ ఆధారంగానే 1975లో ఐసీడీఎస్ను అమలు చేశారు. టీచర్ల శిక్షణ కోసం మూడు మాన్యువల్స్ను ఆమె రాశారు. సెంటర్ ఫర్ వుమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ ఏర్పాటులో ఆమె వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. మీనా స్వామినాథన్ భర్త ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. ఆ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టుగా సౌమ్యా స్వామినాథన్ చేస్తున్నారు. ఎనకామిక్స్లో మధుర స్వామినాథన్ ప్రొఫెసర్. బ్రిటన్లోని ఈస్ట్ అంగ్లియా వర్సిటీలో నిత్యా రావు డైరెక్టర్గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ .. మీనా స్వామినాథన్ మృతి పట్ల నివాళి అర్పించారు.