హైదరాబాద్: ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇవాళ కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన టీకా వేయించుకున్నారు. టీకా తీసుకున్నట్లు తన ట్విట్టర్లో ఎంపీ అసద్ ఓ పోస్టు చేశారు. మరోవైపు ఇవాళ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో సీనియర్ బీజేపీ నేత మురళీ మనోహర్ జోషి కూడా టీకా వేయించుకున్నారు. ఇవాళ్టి వరకు దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మహారాష్ట్ర, పంజాబ్, కర్నాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదు అవుతున్న కేసుల్లో 80 శాతం కేసులు అక్కడే ఉన్నాయని కేంద్రం పేర్కొన్నది. కరోనా మరణాల రేటు 1.37 క న్నా తక్కువగా ఉన్నట్లు చెప్పింది. 14 రాష్ట్రాల్లో గత 24 గంటల్లో కోవిడ్ మరణాలు నమోదు కాలేదు. ఇక కోవీషీల్డ్ టీకా రెండవ డోసు పరిధి కాలాన్ని 4 నుంచి 8 వారాలకు పెంచాలని కేంద్రం తాజాగా తన నివేదికలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.