పూరి జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర కొలువైన మూడు రథాలు ఒడిశాలోని పూరి వీధుల్లో కనువిందు చేశాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన లక్షల మంది భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. రథాలను లాగడానికి భక్తులు పోటీపడ్డారు. కరోనా కారణంగా దాదాపు రెండేండ్లపాటు భక్తులు లేకుండానే రథయాత్రను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది భక్తులను అనుమతించారు. దీంతో జగన్నాథుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. ఈ రథయాత్ర 9 రోజులపాటు కొనసాగనున్నది.