ఎర్నాకుళం: ఉపాధి కోసం పశ్చిమ బెంగాల్ నుంచి కేరళలోని ఎర్నాకుళం వచ్చిన ఎస్కే బాదేశ్ అనే వలస కార్మికుడికి అదృష్టం వరించింది. చాలా సార్లు లాటరీలు కొని లక్ష్మీ కటాక్షం కోసం ఎదురు చూసిన అతడికి ఈ నెల 14న రూ.75 లక్షల లాటరీ తగిలింది. దీంతో అతడు వెంటనే పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టాడు. తనకు లాటరీ డబ్బులు క్లెయిమ్ చేసుకోవడంలో సహాయం చేయాలని, తన లాటరీ టికెట్ ఎవరూ లాక్కోకుండా రక్షణ కల్పించాలని కోరాడు. అతడి అభ్యర్థనకు పోలీసులు అంగీకరించారు.