శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. బండిపొర (Bandipora) జిల్లాలోని సొద్నార సంబాల్లో ఓ వలస కార్మికుడిని (Migrant Labourer) కాల్చిచంపారు. శుక్రవారం తెల్లవారుజామున ఓ కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా, అక్కడ మరణించాడని వెల్లడించారు. అతడిని బీహార్లోని మాధేపురాకు చెందిన మహ్మద్ అమ్రేజ్గా గుర్తించామన్నారు.
During intervening night, #terrorists fired upon & injured one outside #labourer Mohd Amrez S/O Mohd Jalil R/O Madhepura Besarh #Bihar at Soadnara Sumbal, #Bandipora. He was shifted to hospital for treatment where he succumbed.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) August 12, 2022
కాగా, కార్మికుడిపై కాల్పులు జరిపింది తామేనని ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ ప్రకటించలేదు. గురువారం ఉదయం రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంప్పై ముష్కరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ముష్కరులతో జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్హల్ ప్రాంతంలోని పర్గల్లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.