న్యూఢిల్లీ: రోజువారీ కేసులు ఒకేసారిగా పెరగడంతోపాటు కరోనా థర్డ్ వేవ్ను దృష్టిలో పెట్టుకుని కేంద్రం కొవిడ్ మార్గదర్శకాలను (Covid Guidelines) మరో నెల రోజుల పాటు పొడగించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వైరస్ వ్యాప్తిని తనిఖీ చేయడానికి, రానున్న పండుగ సీజన్లో పెద్ద సమూహాలతో సమావేశాలు జరుగకుండా చూసుకోవాలని కొత్త ఉత్తర్వుల్లో తెలిపారు. అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించాలనిఅన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను
‘కొన్ని జిల్లాల్లో యాక్టివ్ కేసులు ఆందోళనకరంగా కొనసాగుతున్నాయి. అయితే, జాతీయ స్థాయిలో మాత్రం స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు, వారి జిల్లాల్లో కేసుల పెరుగుదలను సమర్థంగా అదుపు చేయడానికి, వ్యాప్తిని అరికట్టడానికి అనుకూలమైన నియంత్రణ చర్యలను తీసుకోవాలి’ అని హోం సెక్రటరీ అజయ్ భల్లా తన లేఖలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రెటరీలకు సూచించారు. రానున్న రోజుల్లో ఎక్కువగా పండుగలు ఉన్నందున పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, అవసరమైనపక్షంలో ఆంక్షలు కూడా విధించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఆయన పేర్కొన్నారు.
అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
ఒక్క రోజే కోటి డోసులు : డబ్ల్యూహెచ్ఓ అభినందన
అసోంలో మళ్లీ హింసాకాండ : ఐదుగురు డ్రైవర్లు సజీవ దహనం
చారిత్రాత్మకంగా నిలిచిన ప్రిన్సెస్ డయనా విడాకులు
రాణె తల నరికి తెస్తే 51 లక్షల రివార్డ్ : విశ్వ హిందూ సేన
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..